TG : మేడిగడ్డపై డ్రోన్.. కేటీఆర్పై కేసు నమోదు

X
By - Manikanta |7 Aug 2024 11:16 AM IST
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి, బాల్క సుమన్లపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
జులై 26న మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సందర్శించారు. ఈ పర్యటనలో అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరవేయడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com