ED : నామాకు ఈడీ షాక్.. హైకోర్టు పరిగణలో ఈడీ చార్జ్‌షీట్

ED : నామాకు ఈడీ షాక్.. హైకోర్టు పరిగణలో ఈడీ చార్జ్‌షీట్
X

మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో నామ నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ పై ఈడీ చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది తెలంగాణ హైకోర్టు. రాంచి ఎక్స్ ప్రెస్ లిమిటెడ్, మధుకాన్ ప్రాజెక్ట్స్ పై గతంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. రాంచి -జంషడ్ పూర్ మధ్య ఫోర్ లైన్ హైవే నిర్మాణానికి వెయ్యి 30 కోట్లు లోన్ తీసుకుని నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

పూర్తి లోన్ వచ్చినప్పటికీ మధుకాన్ కంపెనీ నిర్మాణం పూర్తి చేయలేదని తెలిపింది ఈడీ. 365 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ ద్వారా మళ్లించినట్లు గుర్తించింది ఈడీ. గతంలో మధుకాన్ కంపెనీలపై సోదాలు నిర్వహించిన ఈడీ.. 34 లక్షల నగదుతో పాటు 105 ప్రాపర్టీస్ ను అటాచ్ చేసింది.. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్లు సీజ్ చేసింది ఈడీ.

Tags

Next Story