Edupayala temple: ఏడుపాయల అమ్మవారి దర్శనం నిలిపివేశారు..

edupayalu temple (tv5news.in)

edupayalu temple (tv5news.in)

Edupayala temple: మెదక్‌ జిల్లా ఏడుపాయల వన దుర్గాదేవి అమ్మవారి దర్శనం నిలిపివేశారు.

Edupayala temple: మెదక్‌ జిల్లా ఏడుపాయల వన దుర్గాదేవి అమ్మవారి దర్శనం నిలిపివేశారు. అమ్మవారి గర్భాలయం వద్ద వరద ప్రవాహం వలన దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సింగూర్‌ ప్రాజెక్టు నుంచి దుర్గా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. ప్రాజెక్ట్‌ నిండుకుండను తలపిస్తోంది. మరోవైపు భక్తుల సౌకర్యం కోసం అధికారులు.. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గ దేవి ఆరవరోజు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story