Minister Konda Surekha : దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్

దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షిస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. ఇవాళ మేడ్చల్ నియో జకవర్గం చెంగిచెర్ల ఐఓసీ వద్ద అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను మంత్రి కొండా సురేఖ పరి శీలించారు. ఈ మేరకు సంబంధిత వివరాలను స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎట్టి పరి స్థితుల్లో అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎంతటివారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుందన్నారు. బోడుప్పల్ పరిధిలో మూడు సర్వే నంబర్లలో ఎండోమెంట్ కి సంబంధించి 30 ఎకరాలకు పైగా స్థలం ఉందని తెలిపారు. ఈ భూమిని కొందరు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామన్నారు. అంతకుముందు పలువురు స్థా నికలు దేవాదాయ భూములు, తమ భూములకు రక్షణ కల్పించాలని మంత్రి కోరారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరలోనే భూములపై సర్వే నిర్వహించి... ఆ రిపోర్టు ఆధారంగా సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com