Minister Konda Surekha : దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్

Minister Konda Surekha : దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్
X

దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షిస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. ఇవాళ మేడ్చల్ నియో జకవర్గం చెంగిచెర్ల ఐఓసీ వద్ద అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను మంత్రి కొండా సురేఖ పరి శీలించారు. ఈ మేరకు సంబంధిత వివరాలను స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎట్టి పరి స్థితుల్లో అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎంతటివారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుందన్నారు. బోడుప్పల్ పరిధిలో మూడు సర్వే నంబర్లలో ఎండోమెంట్ కి సంబంధించి 30 ఎకరాలకు పైగా స్థలం ఉందని తెలిపారు. ఈ భూమిని కొందరు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామన్నారు. అంతకుముందు పలువురు స్థా నికలు దేవాదాయ భూములు, తమ భూములకు రక్షణ కల్పించాలని మంత్రి కోరారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరలోనే భూములపై సర్వే నిర్వహించి... ఆ రిపోర్టు ఆధారంగా సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Next Story