భవిష్యత్ కార్యాచరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా : ఈటల రాజేందర్
By - TV5 Digital Team |5 May 2021 9:30 AM GMT
భవిష్యత్ కార్యాచరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. అందరి అభిప్రాయాలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటానన్నారు.
భవిష్యత్ కార్యాచరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. అందరి అభిప్రాయాలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటానన్నారు. తనకు జరిగిన అన్యాయం సహించరానిదని చాలా మంది చెప్పారన్నారు. మూడు రోజులుగా చాలా మంది నియోజకవర్గ ప్రజలే కాకుండా.. ఇతర జిల్లాల ప్రజలు తనను కలిసినట్లు వెల్లడించారు. తెలంగాణ కోసం మిలిటెంట్ ఉద్యమాలు కూడా చేశామన్నారు. ఈటల. రైల్ రోకో చేసినప్పుడు వందల మందికి అన్నం పెట్టానని.. ఉప్పల్ రైల్వేస్టేషన్లో ఫైరింగ్కు ఆర్డర్ ఇచ్చినా నిలబడి పోరాడామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com