MLC Kavitha : ముగ్గురు మంత్రులున్నా పనులు సున్నా.. కవిత విసుర్లు

X
By - Manikanta |22 April 2025 4:15 PM IST
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా పాల్వంచ చేరుకున్నారు. అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్వి ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు.
భద్రాద్రి జిల్లా అంటేనే పోరాటాలకు గడ్డ అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా, జిల్లా అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని మండిపడ్డారు. అనంతరం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిని కవిత దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం లక్ష్మీ తాయారమ్మ ఆలయంలో వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com