Fake Police : కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి నకిలీ పోలీస్

కానిస్టేబుల్ని అంటూ ఓ వ్యక్తి పోలీస్ కమాండ్ కంట్రోల్లోకి ప్రవేశించాడు. గోవర్ధన్ అనే అతను కానిస్టేబుల్ అని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అతణ్ని నమ్మించడానికి సీఎం సమీక్ష జరుగుతున్నప్పుడే కమాండ్ కంట్రోల్ లోకి వెళ్లి వచ్చాడు. ఆపై అతను కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నిందితుడి చిత్రాలు నమోదయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్ పల్లిలో నివాసం ఉంటున్న జ్ఞానసాయి ప్రసాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అంటూ జ్ఞానసాయి ప్రసాద్ తో పరిచయం పెంచుకున్నాడు. హోటల్ వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయని, భాగస్వామ్యంతో బిజినెస్ ప్రారంభిద్దామని నమ్మబలికాడు. తనపై నమ్మకం కలిగేందుకు మంగళవారం జ్ఞానసాయి ప్రసాద్ ను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు తీసుకొచ్చాడు. దానికి ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్ లో కూర్చోబెట్టి బిజినెస్ గురించి మాట్లాడాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com