TG Rythu Bharosa : పది రోజుల్లో రైతు భరోసా పంపిణీ

X
By - Manikanta |29 May 2025 11:15 AM IST
ఈ ఏడాది 15 రోజుల ముందే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నాలుగు ఎకరాలు, అంతకంటే మించిసాగుభూమి ఉన్న రైతులకు రైతు భరోసాను మరో పది రోజుల్లో పంపిణీ చేయనుంది. ఖరీఫ్ సీజన్ వరి నాట్లకు ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతుభరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించగా.. మరో పది రోజుల్లో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూ మీ ఉన్న రైతుల ఖాతాల్లోనూ నిధులు జమ కానున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com