Farmers : సాగర్ నీళ్ల కోసం రైతుల ఆందోళన

X
By - Manikanta |29 Aug 2024 6:15 PM IST
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. సాగర్ జలాశయం నిండుకుండలా ఉన్నా, ఎడమ కాలువ పోటెత్తిపారుతున్నా, తమకు మాత్రం చుక్క నీరు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కాలువ పరిధిలోని ఎనిమిది గ్రామాలకు తక్షణమే సాగు తాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చేపట్టడంతో..నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com