Osmania Hospital : ఉస్మానియాలో పెయిన్ క్లినిక్ సేవలకు రాష్ట్రంలోనే తొలిసారి శ్రీకారం

దీర్ఘకాలికంగా వెన్నుపూస .. మోకా ళ్లు.. క్యాన్సర్ నొప్పులతో బాధపడే వారికి ఉపశమనం కలిగే వైద్య చికిత్స అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ మెడికల్ కళాశాలలైన ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించి విదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయ వైద్యులు తాము జన్మించిన జన్మభూమి, వైద్య విద్యను అందించిన ప్రాంతాల ప్రజల రుణం తీర్చుకోవాలన్న తపనతో తెలం గాణ రాష్ట్రంలో అందుబాటులో లేని వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ (ఐఎంఏ) సహకారంతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ వంతు సహకారం అందించారు. పెయిన్ క్లినిక్ సేవలకు అవసరమైన సాంకేతిక వైద్య పరికరాలు, అవసరమైన సామాగ్రిని ఐఎంఏ, ప్రవాస భారతీయ వైద్యులు సమకూర్చేందుకు ముందుకొచ్చారు.
సుమారు కోటి రూపాయల విలువైన పరికరాలను సిఎస్ఆర్ ఫండ్ రూ పంలో అందించేందుకు అంగీకరించారు. పెయిన్ క్లినిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నెల 17న ఉస్మానియా ఆస్పత్రిలో ప్రారంభిం చారు. పెయిన్ క్లినిక్ అవసరమైన ఆర్థోపెడిక్, అనస్థీషియా, న్యూరో సర్జన్ లను నియమించి పెయిన్ క్లీనిక్ సేవలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో లేని ఖరీదైన పెయిన్ క్లినిక్ వైద్యం ప్రవాస భారతీయ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ సహకారంతో అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో అతి ఖరీదైన ఈ వైద్యం నిరుపేదలకు అందుబాటులోకి వచ్చింది. దీర్ఘకాలి కమైన నొప్పులతో బాధపడుతున్న లక్షలాదిమంది నిరుపేదలకు పెయినే క్లినిక్ వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే ప్రముఖ ఆసుపత్రిగా వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ సేవలను ఏర్పాటు చేయడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, చతిస్గడ్, కేరళ, మహారాష్ట్ర ప్రజల కు ఈ వైద్యం అందుబాటులోకి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com