Chutneys : ‘చట్నీస్’లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు

ఫుడ్ సేఫ్టే అధికారులు రెస్టారెంట్, హోటళ్లపై కొరడా ఝుళిస్తున్నారు. నాణ్యత లోపానికి తావివ్వకుండా.. ఏ చిన్న పొరపాటు చేసినా కేసులు నమోదు చేస్తూ.. అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ హోటల్.. రెస్టారెంట్స్ యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అయితే.. తాజాగా కొండా పూర్లోని శరత్ సిటీ మాల్లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ చట్నీస్లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో ముడిసరుకు నిల్వ చేసిన ప్రదేశంలో, సరుకుల్లో బొద్దింకలు దర్శనమిచ్చాయి. అంతేకాకుండా.. లైసెన్స్ ఉండాల్సిన ప్రదేశంలో లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పిండి, రవ్వ నిల్వల్లో నల్ల పరుగుల కనిపించాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. ముడి సరుకులతో పాటు శానిటరీ ద్రవాలు ఒకే చోట నిల్వ చేయబడ్డాయని, వాష్ ఏరియా మొత్తం దుర్వాసనతో చాలా దుర్గంధంగా ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. నిల్వ ఉంచిన ఉల్లిపాయలు, క్యాబేజీతో పాటు పలు కూరగాయలు కూడా చెడిపోయి మానవ వినియోగానికి పనికిరాని విధంగా ఉన్నాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com