KTR : హై కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్స్

KTR : హై కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్స్
X

మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టు ను ఆశ్రయించారు. భారతీయ నాగరిక్ సురక్షా సింహిత సెక్షన్ 528 ప్రకారం తనపై దాఖలైన రెండు కేసులను క్వాష్ చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. బంజారాహిల్స్, ముషీరాబాద్ పీఎస్లలో నమోదైన కేసులు కొట్టేయాలని కోరారు. సీఎం రేవంత్ ను అవమానించారంటూ కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదుతో బంజారా హిల్స్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద సీఎం రూ. 2500 కోట్లు తీసుకున్నట్లు కేటీఆర్ ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్త బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంను ఉద్దేశ పూర్వకంగా అవమానించలేదని, తన వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో పటాకులు కాల్చినందుకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే ముఠాగోపాల్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుల తదుపరి విచారణను హైకోర్టు మార్చి 18కి వాయిదా వేసింది.

Tags

Next Story