TG : కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య.. సీఎం సోదరులపై కేటీఆర్, హరీశ్ విసుర్లు

TG : కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య.. సీఎం సోదరులపై కేటీఆర్, హరీశ్ విసుర్లు
X

సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు మాజీ సర్పంచ్ సాయి రెడ్డి సుసైడ్ నోట్ రాశారు. పశువైద్య కళాశాల వెనుకాల సాయిరెడ్డి ఇళ్లు ఉంది. తన ఇంటికి దారిలేకుండా పశు వైద్యశాల ప్రహరీ గోడను నిర్మించడంతో మనస్థాపంతో మాజీ సర్పంచ్, కొండరెడ్డిపల్లి పానికి గురై కల్వకుర్తికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేసమయంలో పెట్రొలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపు సాయిరెడ్డి మృతిచెందారు. సాయి రెడ్డి రాసినట్లుగా పేర్కొంటున్న సుసైడ్ నోట్లో తనను సీఎం అన్నదమ్ముల వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు పేర్కొనడం సంచలనం రేపుతోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుల అరా చకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండాపల్లి మాజీ సర్పంచ్ పాములకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసు కోవడం అత్యంత బాధాకరమని, ఇది ఆత్మహత్య కాదు సీఎం బ్రదర్స్ చేసిన హత్య అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది ప్రజా పాలన కాదని అరాచక, నియంత, దుర్మార్గ పాలన అని హరీశ్ రావు మండిపడ్డారు.

Tags

Next Story