Mandakrishna Madiga : మార్చి 11న భవిష్యత్ కార్యాచరణ మందకృష్ణ మాదిగ

మార్చి పది తేదీలోపు ఎస్సీలను ఏబీసీడి గ్రూపులుగా విభజించకుండా, లోపాలను సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తే మార్చి 11వ తేదీ, నుంచి ఎమ్మార్పీఎస్, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలను సవరించి, ఎస్సీలను ఏబీసీడీలుగా గుర్తించాలని, అభివృద్ధి చెందని కులాలకు మొదటి ప్రాధాన్య ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిపి మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. మాదిగ అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఫిబ్రవరి 11వ తేదీన రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని పేర్కొన్నారు. మాదిగ అమరవీరుల త్యాగాల గుర్తుగా ఒక స్థూపాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సమీపంలో 5, ఎకరాలలో స్థలంలో మాదిగ అమరవీరుల గుర్తుగా ఒక మ్యూజియం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 1న మాదిగ అమరవీరుల దినోత్సవం గ్రామ మండల, జిల్లా కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మార్చి 3 నుండి 10 వరకు జరిగే డప్పుల ప్రదర్శనకు కళాకారులతో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు పా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మత విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చ గొట్టే వాళ్ళ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులుగా సమైక్యతకు పాటుపడుతున్న ముస్లిం లను కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని వదిలేస్తున్నాయని మంద కృష్ణమాదిగ ఆరోపించారు. బీఎం ఆర్పీఎఫ్ ఆవిర్భావ సభలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లింలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండాలంటే పేదరికం పోవాలని సూచించారు. మైనార్టీల కు విద్య, ఉద్యోగం, రంగంతో పాటు రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల కోటా పెంచాలని, జీవన ప్రమాణాల్లో మెరుగుదల కోసం మైనార్టీలకు ప్ర భుత్వాల నుంచి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఇకనైనా ముస్లిం మైనార్టీలు తమ స్వంతత్ర ఎజెండాతో మందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com