Tejeshwar Murder Case : తేజేశ్వర్ హత్య కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ప్రెస్మీట్

తేజేశ్వర్ హత్య కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ప్రెస్మీట్ నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితో సంబంధం ఉంది. ఈ వివాహేతర సంబంధాలు కొనసాగించాలని తిరుమలరావు అనుకున్నాడు. ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి తేజేశ్వర్ను చంపేందుకు స్కేచ్ వేశారు. తేజేశ్వర్ను చంపేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని స్కెచ్ వేసిన తిరుమల రావు. తిరుమలరావు, ఐశ్వర్య.. ఎప్పుడూ వీడియోకాల్లో ఉండేవారు. చాలాసార్లు తేజేశ్వర్పై అటాక్ చేసేందుకు సుపారీ గ్యాంగ్ ప్రయత్నించింది. పొలం సర్వే చేయాలని తేజేశ్వర్ను తీసుకొని వెళ్లారు. కారులో డ్రైవర్ పక్కన కూర్చున్న తేజేశ్వర్ ను చంపారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, ఐశ్వర్య, సుపారీ గ్యాంగ్ను అరెస్ట్ చేశామని -ఎస్పీ వెల్లడించారు. తిరుమలరావుకు ఇదివరకే వివాహమైంది. అయితే, తన భార్యను హత్య చేసి, ఆ తర్వాత ఐశ్వర్యను వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్యకు తేజేశ్వర్తో వివాహం జరగడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకు, ఇతర ఖర్చులకు అవసరమైన డబ్బును సమకూర్చుకునేందుకు తిరుమలరావు ఓ బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఆయన పనిచేస్తున్న బ్యాంకులోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com