TG : ఉద్యోగులకు తెలంగాణలో ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 7కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకోబోతుంది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విజయోత్సవాల ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూల వేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com