TG : గుడ్ న్యూస్.. నెలాఖరు నుంచే రైతుభరోసా పంపిణీ

X
By - Manikanta |4 Nov 2024 1:00 PM IST
తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందిచే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందుకు తగిన విధంగా నిధులు సర్దుబాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. తొలుత ఒక ఎకరం నుంచి ప్రారంభించి డిసెంబర్ నెలఖారు వరకూ రైతుల ఖాతాల్లో నిధులు జమ పూర్తిచేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఎన్ని ఎకరాల వరకూ రైతు భరోసా ఇవ్వాలన్న విషయంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com