Gorati Venkanna : గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం.. దాశరథి ప్రజా పురస్కారం

దాశరథి సాహిత్యంలో చెప్పినట్లు గాయపడిన కవిగుండెల్లో రాయడని కావ్యాలోన్నో ఇతివృత్తాన్ని ఆదర్శంగా తీసుకుని గోరటి వెంకన్న మరిన్ని రచనలు చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సగేష్ భీమపాక ఆకాంక్షించారు. వాసవీ శ్రీనిలయం వేదికగా మాభూమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో జరిగిన దాశరథి శతజయంతి సభలో ప్రజాకవి గోరటి వెంకన్నకు దాశరథి సాహిత్య పురస్కారాన్ని హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక ప్రదానం చేశారు.
దాశరథి, గోరటి వెంకన్న ఇద్దరూ ప్రజాకవులని చెప్పారు జస్టిస్ సగేశ్. తెలంగాణలో ఎంతో మంది గొప్ప ప్రజాకవులు పుట్టారని చెప్పారు. వారంతా ప్రజా పాటలకు స్ఫూర్తి అని చెప్పారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న సంతా.. మా ఊరి సంతా పాటపాడి సభికులను ఉర్రూతలూగించారు.
అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేయనున్నట్లు కార్యక్రమ నిర్వాహకుడు గొర్రెపాటి నరసింహాప్రసాద్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com