Telangana PSC : గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా

X
By - Manikanta |11 Jun 2025 4:15 PM IST
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో కీలక అప్డేట్ విడుదల చేసింది. గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేస్తూ ప్రకటన జారీ చేసింది. టీజీపీఎస్సీ ఇదివరకే జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 18 నుంచి జులై 8 వరకు జరగాల్సిన సర్టిఫికెట్ పరిశీలన ప్రక్రియను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే పోస్టులు మిగిలిపోకుండా ముందుగా గ్రూప్ 2సర్వీసెస్ నియామకాలు పూర్తైన తర్వాత ఈ నియామకాల మిగిలిన ప్రక్రియ మొదలు పెట్టాలని ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com