Harish Rao : బీద రైతుల కడుపుకొట్టే ప్రయత్నం మానుకో : హరీశ్ రావు

Harish Rao : బీద రైతుల కడుపుకొట్టే ప్రయత్నం మానుకో : హరీశ్ రావు
X

సీఎం రేవంత్ రెడ్డి బీద రైతుల కడుపుకొట్టే ప్రయత్నాలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నిన్న జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనపై హరీశ్ రావు ట్విట్టర్ లో స్పందించారు. ఫ్యాక్టరీ వద్దంటే 12 మంది రైతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం దుర్మార్గమన్నారు. సీఎం సొంత జిల్లాలో ఈ ఘటన జరిగితే ఇప్పటికీ స్పందించరా? అని ప్ర శ్నించారు. ' పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషం. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడా రైతులకు బేడీలు వేసిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పుపట్టినా బుద్ధి రాలేదు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులను కొట్టారు. మీ రియల్ ఎస్టేట్ దందాలు పెంచుకోవడానికి 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ విషయంలో కూడా రైతులపై కేసులు పెట్టినవ్. రైతులను కొట్టు కమిషన్లు పట్టు అనే విధంగా సాగుతుంది నీ పాలన. తెలంగాణ రైతు లోకం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు. అరెస్ట్ చేసిన పెద్ద ధన్వాడ గ్రా మానికి చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి' అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Tags

Next Story