Rains in Telangana : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 21 వరకు అతిభారీవర్షాలు

రానున్న అయిదు రోజుల పాటు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృత మైన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీనపడినట్లు పేర్కొంది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగా ళాఖాతం వరకు పయనిస్తూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగు తున్నట్లు వెల్లడించింది. మరో అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ ప్రభావంతో ఈ నెల 21 వరకు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం రికార్డయ్యే అవకాశం ఉందని చెప్పింది. గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. బుధవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాల పల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయాజిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది.
అదే విధంగా.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల కరీం నగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, మన్మకొండ, జనగాం, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com