Telangana : మరో 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో 3 రోజులు వి స్తారంగా వర్షాలు కురుస్తాయి. నిన్న రాత్రి హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో వాన దంచికొట్టింది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 8.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 8.38 సెంటీమీటర్లు, యాదాద్రిభువనగి రి జిల్లాలో 6.55 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో అత్యధి కంగా ముషీరాబాద్ లో 4.18 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్ లో 3.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుల తో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చేమూడు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఈ నేపథ్యంలో యెల్లో అలర్ట్స్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఉత్తరాంధ్ర కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉప రితల ఆవర్తనం.. ఇవాళ ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం, సమీపంలోని దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీలో కొ నసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వర్ష సూచన ఉంది. ఇవాళ జయశంకర్ భూపాలప ల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశంతో ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచిస్తుంది. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావ రణ శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com