Heavy Rainfall : తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షా లు కురవనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ వైపునకు వంగి ఉందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం తెలం గాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా రాష్ట్రంలోని మరో 15 జిల్లాలకు ఎల్లో అలెర్జ్న వాతావరణ కేంద్రం జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీచే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూ పాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com