High Court : డెడ్ బాడీలను భద్రపర్చండి .. పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఏటూరునాగారం ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల డెడ్ బాడీలను భద్రప రచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మావోయిస్టుల ఎన్ కౌంటర్పై ఇవాళ హైకో ర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. భోజనంలో మత్తుపదార్థాలు కలిపి మావోయి స్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మావోయిస్టుల మృత దేహాలపై తీవ్ర గాయాలున్నాయని, కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టు మార్టం కోసం తరలించారని కోర్టుకు వివరిం చారు. ఎస్ఆర్ఆర్డీసీ నిబంధనలకు విరుద్ధం గా పోలీసులు వ్యవహరించారన్నారు. అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా డెడ్ బాడీలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక ఫారెస్ట్రియా ల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను తరలింపులో చివరి నిమిషం వరకు హైడ్రామా కొనసాగింది. రాత్రి 9 గంటలకు ఏటూరునా గారం నుంచి ములుగు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పసర వరకు వెళ్లిన ట్రాక్టర్ ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. అనంతరం ఇవాళ మధ్యా హ్నం 3:20 గంటలకు పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో డాక్టర్లు పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభించారు. కాగా మృతుల్లో ఏగోళపు మల్లయ్య అలియాస్ మధు కుటుంబ సభ్యులు, భద్రు తల్లి మాత్రమే పోస్టుమార్టం రూం వద్దకు వచ్చారు. కాగా మిగితా వారి కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించ డం లేదా.. లేక వచ్చినవారని ఎక్కడైనా దాచి పెట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com