Telangana : రేపటి నుంచి అంగన్వాడీలకు సెలవులు

Telangana : రేపటి నుంచి అంగన్వాడీలకు సెలవులు
X

తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఎండలు మండుతున్న నేపథ్యంలో రేపటి నుంచి నెల రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏండ్ల నుంచి చిన్నారుల పేరెంట్స్, అంగన్వాడీ యూని యాన్ల నుంచి వేసవి సెలవులు ప్రకటించాలనే డిమాండ్ఉంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క చొరవతో ఏండ్ల నాటి డిమాండ్ నెరవేరింది. ఇవాళ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో అంగన్వాడీ యానియాన్లతో డైరెక్టర్ క్రాంతి వెస్లీ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనితో పాటుగా అంగన్వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సెల వుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చిన్నారు లకు, గర్భిణిలు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరుకులు సరఫరా చేయనున్నారు. అంతేకాక అంగన్వాడీ టీచర్లకు సెలవుల్లో ఇతర విధులు అందించేలా చర్యలు చేపట్టారు. ఇంటింటి సర్వే, హోం విపిట్స్, అంగన్వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను నిర్వ ర్తించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో వేసవి నుంచి లబ్ధిదారులకు, చిన్నారులకు కాస్త ఉపశమనం లభించ నుంది. అంగన్వాడీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వానికి చొరవ చూపిన మంత్రి సీతక్క కు అంగన్వాడీ యూనియన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story