Kukatpally : రూ.2 లక్షలు కడితేనే డెడ్ బాడీ ఇస్తాం.. హాస్పిటల్

కూకట్పల్లిలోని ఓమ్ని హాస్పిటల్లో దారుణం జరిగింది. రెండు లక్షల రూపాయల బిల్లు కడితేనే మృతదేహాన్ని ఇస్తామంటూ హాస్పిటల్ యాజమాన్యం పట్టుబట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈశ్వరిదేవి అనే మహిళ చికిత్స పొందుతూ మరణించింది. మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని అడగ్గా.. 2 లక్షల రూపాయలకుపైగా ఉన్న బిల్లు చెల్లించి తీసుకెళ్లాలని తేల్చి చెప్పింది. ఇదేమిటని ప్రశ్నించిన కుటుంబ సభ్యులతో ఆసుపత్రి యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. దాంతో ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మూడు రోజులుగా చికిత్స అందించి హార్ట్ అటాక్తో ఇప్పుడు చనిపోయిందని చెప్పారని బాధితులు ఆరోపించారు. మృతదేహాన్ని తమకు ఇవ్వకుండా దాచిపెట్టి డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదనగా చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com