HYD RAINS: మూసీ మహోగ్రరూపం

HYD RAINS: మూసీ మహోగ్రరూపం
X
భారీ వర్షాలకు ఉప్పొంగిన మూసీ నది.. భాగ్యనగరాన్ని ముంచేసిన మూసీ వరద.. నీట మునిగిన హైదరాబాద్ ప్రధాన బస్ స్టేషన్

తె­లం­గాణ వ్యా­ప్తం­గా జో­రు­గా వర్షా­లు కు­రు­స్తు­న్నా­యి. భారీ వర్షా­ల­కు హై­ద­రా­బా­ద్ నగ­రం­లో జన జీ­వ­నం స్తం­భిం­చి­పో­యిం­ది. దీ­ని­తి తోడు జంట జలా­శ­యా­లైన హి­మా­య­త్‌­సా­గ­ర్, ఉస్మా­న్‌­సా­గ­ర్‌ నిం­డు­కుం­డ­లా మా­ర­డం­తో గే­ట్ల­ను ఎత్తి భా­రీ­గా నీ­టి­ని ది­గు­వ­కు వి­డు­దల చే­శా­రు. ఎగు­వన కు­రి­సిన వర్షాల కా­ర­ణం­గా ప్ర­వా­హం పె­ర­గ­డం­తో మొదట 13,500 క్యూ­సె­క్కుల నీ­టి­ని వి­డు­దల చే­య­గా.. దా­ని­ని 35,000 క్యూ­సె­క్కు­ల­కు పెం­చ­డం­తో మూసీ నది ఇటీ­వల కా­లం­లో ఎన్న­డూ లే­నం­త­గా మహో­గ్ర­రూ­పం దా­ల్చిం­ది. భారీ వర్షా­ల­కు మూసీ వరద ఉధృ­తి పె­రి­గిం­ది. చా­ద­ర్‌­ఘా­ట్‌ లో­లె­వ­ల్‌ వం­తెన పై­నుం­చి ఆరు అడు­గుల మేర వరద ప్ర­వ­హిం­చిం­ది. మూ­సా­రాం­బా­గ్‌ వం­తెన పై­నుం­చి ఏకం­గా 10 అడు­గుల మేర నీరు ప్ర­వ­హిం­చిం­ది. ఎం­జీ­బీ­ఎ­స్‌ (మహా­త్మా­గాం­ధీ బస్‌ స్టే­ష­న్‌) లోకి వె­ళ్లే రెం­డు వం­తె­న­లు పూ­ర్తి­గా నీట ము­ని­గి­పో­యా­యి. వరద నీరు నే­రు­గా బస్డాం­డ్‌­లో­కి చే­ర­డం­తో వందల మంది ప్ర­యా­ణి­కు­లు చి­క్కు­కు­పో­యా­రు. పో­లీ­సు­లు వా­రి­ని తా­ళ్ల సహా­యం­తో బయ­ట­కు తీ­సు­కొ­చ్చా­రు. చా­ద­ర్‌­ఘా­ట్‌ కా­జ్‌­వే వం­తెన, మూ­సా­రాం­బా­గ్‌ బ్రి­డ్జి­తో సహా పలు ప్రాం­తా­ల్లో రహ­దా­రు­ల­ను పూ­ర్తి­గా మూ­సి­వే­సి ట్రా­ఫి­క్‌ ఆం­క్ష­లు వి­ధిం­చా­రు. దీని ప్ర­భా­వం­తో ది­ల్‌­సు­ఖ్‌­న­గ­ర్, కోఠి మధ్య తీ­వ్ర ట్రా­ఫి­క్‌ అం­త­రా­యం ఏర్ప­డిం­ది. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంజీబీఎస్‌లో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే బయటకు తరలించాలని, పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అర్థరాత్రి స్వయంగా ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.


చాదర్ ఘాట్ లో నీట మునిగిన ఇళ్లు

మూసీ ఉద్ధృతి­కి హై­ద­రా­బా­ద్ లోని చా­ద­ర్ ఘాట్ సమీ­పం­లో పలు కా­ల­నీ­లు నీట ము­ని­గా­యి. అం­బే­డ్క­ర్ బస్తీ­తో పాటు పలు కా­ల­నీ­ల్లో­కి వరద చే­రిం­ది. చా­ద­ర్ ఘాట్ సమీ­పం­లో నది­కి ఇరు­వై­పు­లా ఉన్న ఇళ్లు నీట ము­ని­గా­యి. మూసీ నీ­టి­మ­ట్టం అం­త­కం­త­కు పె­ర­గ­డం­తో పరీ­వా­హక కా­ల­నీ­ల్లో జనా­లు అర్ధ­రా­త్రి బి­క్కు­బి­క్కు­మం­టూ గడు­పు­తు­న్నా­రు. అధి­కా­రు­లు వందల మం­ది­ని సమీ­పం­లో­ని పు­న­రా­వాస కేం­ద్రా­ల­కు తర­లిం­చా­రు. ము­సా­రాం­బా­గ్‌ బ్రి­డ్జి వద్ద పు­రో­గ­తి­లో ఉన్న పై­వం­తెన ని­ర్మాణ సా­మ­గ్రి వరద నీ­టి­లో కొ­ట్టు­కు­పో­యిం­ది. జి­యా­గూడ వద్ద మూసీ ఉద్ధృ­తం­గా ప్ర­వ­హి­స్తోం­ది. దీం­తో జి­యా­గూడ నుం­చి పు­రా­నా­పూ­ల్‌ వె­ళ్లే హై­వే­పై­కి భా­రీ­గా వరద చే­రు­తోం­ది. ఫలి­తం­గా ఈ మా­ర్గం­లో రా­క­పో­క­లు ని­లి­చి­పో­యా­యి. వరద ధా­టి­కి పలు వా­హ­నా­లు, చి­న్న చి­న్న ఆల­యా­లు నీ­ట­ము­ని­గా­యి. ఇళ్ల­ను తా­కు­తూ మూసీ ప్ర­వ­హి­స్తోం­ది. ప్ర­జ­లు ప్ర­వా­హం వైపు వె­ళ్ల­కుం­డా పో­లీ­సు­లు, డీ­ఆ­ర్‌­ఎ­ఫ్‌ బృం­దా­లు పహా­రా కా­స్తు­న్నా­యి.


మూ­సీ­లో వరద ఉధృ­తి పె­ర­గ­డం­తో లో­త­ట్టు ప్రాం­తాల ప్ర­జ­ల­ను జీ­హె­చ్ఎం­సీ, జల­మం­డ­లి, హై­డ్రా, పో­లీ­సు అధి­కా­రు­లు అప్ర­మ­త్తం చే­శా­రు. జీ­హె­చ్ఎం­సీ ఇప్ప­టి­కే లో­త­ట్టు ప్రాం­తా­ల్లో­ని వరద బా­ధి­తుల కోసం సహాయ కేం­ద్రా­ల­ను ఏర్పా­టు చే­సిం­ది. ఇప్ప­టి­వ­ర­కు 1000 మం­ది­కి పైగా ప్ర­జ­ల­ను పు­న­రా­వాస కేం­ద్రా­ల­కు తర­లిం­చిం­ది. అక్కడ వా­రి­కి ఆహా­రం, తా­గు­నీ­రు, వై­ద్య సహా­యం ఏర్పా­టు చే­శా­రు. అవ­స­ర­మై­న­వా­రి­కి దు­ప్ప­ట్లు అం­ది­స్తు­న్నా­రు. పౌ­రు­ల­కు భద్ర­త­కు సం­బం­ధిం­చి అన్ని చర్య­లు తీ­సు­కుం­టు­న్న­ట్లు జీ­హె­చ్‌­ఎం­సీ కమి­ష­న­ర్ ఆర్వీ కర్ణ­న్ తె­లి­పా­రు. మూసీ నది­పై ని­ర్మా­ణం­లో ఉన్న కొ­త్త వం­తె­న­ను ఆర్వీ కర్ణ­న్ పరి­శీ­లిం­చా­రు. క్షే­త్ర­స్థా­యి­లో పరి­స్థి­తి­ని అడి­గి తె­లు­సు­కు­న్నా­రు సహాయ కేం­ద్రా­ల­ను కూడా ఆర్వీ కర్ణ­న్ సం­ద­ర్శిం­చా­రు.

Tags

Next Story