Hyderabad : సదర్కు హైదరాబాద్ రెడీ.. నవంబర్ 2న దున్నల సందడి

X
By - Manikanta |29 Oct 2024 8:00 PM IST
భాగ్యనగరం సదర్ ఉత్సవాలకు ముస్తాబవుతుంది. నవంబర్ రెండవ తేదీన సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఎడ్ల హరిబాబు యాదవ్ అన్నారు. సదర్ త్సవాలకు ఈసారి ఇంటర్నేషనల్ గోలు 2 అనే దున్న రాజును ఈసారి హర్యానా రాష్ట్రం నుండి తీసుకొచ్చామని తెలిపారు. ఈ దున్నరాజు 1800 కిలోలు ఉంటుందని తెలిపారు. గోలు దున్నరాజుకు జాతీయ ఛాంపియన్ పోతుగా రాష్ట్రపతి , ప్రధానమంత్రి మోదీ ఐదు లక్షల బహుమానాన్ని ప్రకటించారన్నారు. ఈసారి సదర్ ఉత్సవాల్లో గోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ సదర్ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com