Raja Singh : నా కుటుంబం జోలికొస్తే ఊరుకోను : రాజాసింగ్

తన జోలికి కానీ, తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్రను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. శోభయాత్ర జరిగే మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్యాచ్ వర్క్, ట్రీ కటింగ్, లైట్లు తదితర వాటిని పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా ప్రతీ సంవత్సరం పోలీసులు వల్లనే ఇబ్బంది అవుతోందనీ.. పోలీసులు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని రాజాసింగ్ అన్నారు. ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని అధికారులను కోరడం జరిగిందన్నారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర మార్గాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పైనే తన కొడుకుతో కలిసి పర్యటిస్తూ సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్య కర్తలు, కార్పొరేటర్లు ఉన్నారు.
భద్రతా కారణాలరీత్యా ప్రభుత్వం కేటా యించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడాలని, భద్రతా సిబ్బందిని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలు రాజాసింగ్ ను పోలీసులు కోరారు. ఈ మేరకు ఆయనకు 19న హైదరాబాద్ లోని మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. నా జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి గానీ ఎవరైనా వస్తే అడ్డంగా నరుకుతానంటూ హెచ్చరించారు. తాను, తన కుమారుడు పక్కాగా బైకు నడుపుతామని, పోలీసు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తాము బైక్ పైనే తిరుగుతామని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com