TG : పెరుగుతున్న చలి.. 3 రోజులు జాగ్రత్త!

తెలంగాణలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది. నిన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్లో చాలా చోట్ల 10 డిగ్రీలు, హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు ప్రాంతంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా పిల్లల్లో శ్వాసకోస సంబంధిత సమస్యల తీవ్రత సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20 శాతం నుంచి 30 శాతం పెరిగిందని చెబుతున్నారు. చలి వాతావరణంలో పిల్లలపై ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. హైపోథెర్మియాతో సమస్యలు వస్తాయని.. మొదట జలుబు సోకి, తర్వాత వైరస్లతో న్యుమోనియా, ఫ్లూ లాంటివి దారితీస్తాయన్నారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com