TG : తెలంగాణలో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్

TG : తెలంగాణలో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్
X

తెలంగాణలో షుగర్ వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న రోగులసంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రానున్న నాలుగైదేళ్లలో తెలంగాణలో షుగర్ పేషెంట్ల సంఖ్య 50లక్షలకు చేరుకోనున్నట్లు వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24.5 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల పార్లమెంట్కు సమర్పించిన నివేదిక బహిర్గతం చేసింది. అదే సమయంలో నేషన్ ఫ్యామిలీ హెల్త్ సర్వే - 5 (ఎన్ఎఫ్ హెచ్ఎస్-5) 2019-2021లో నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో మధుమేహంతో బాధపడుతున్న రోగుల్లో.. పురుషులు 13.8 శాతం ఉండగా మహిళల సంఖ్య 10.2శాతంగా ఉంది. ఎక్కువగా షుగర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం అని నిపుణులు చెబుతున్నారు.

Tags

Next Story