Kaleshwaram : కాళేశ్వరంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

X
By - Manikanta |18 July 2024 12:01 PM IST
గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని గోదావరి నది మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నదులు ఉప్పొంగి పొంగడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. త్రివేణి సంగమ గోదావరి నది 6 మీటర్ల ఎత్తు నుండి ప్రవహిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాణహిత గోదావరి నదిలో నుండి 5 లక్షల క్యూసెక్కుల నీరువచ్చి మేడిగడ్డ బ్యారెజ్ లో చేరుతుంది. దీనితో పూర్తిస్థాయిలో ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇలానే మరింత వర్షం కురిస్తే గోదావరి నది మరింత పెరిగే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com