Minister Ponguleti : ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

Minister Ponguleti : ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
X

పట్టణాల్లోని మురికివాడల్లో ని వశిస్తున్న పేదలకు అక్కడే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదల ఉపాధికి ఇబ్బంది రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆయన ఇవాళ సమీక్షించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్కు దూరంగా గతంలో 42 వేల ఇండ్లను నిర్మిస్తే సుమారు 19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారన్నారు. ఇటీవల క్షేత్ర స్థాయిలో మరోసారి పరిశీలన జరుపగా కేవలం 13 వేల మంది మాత్రమే ఆ నివాసాలలో ఉంటున్నట్లు తేలిందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జీ ప్లస్ 3 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించి నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలి విడతలో హైదరాబాద్లో 16 మురికివాడలు గుర్తించామని, ఇతర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూ పొందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా గిరిజనుల కోసం 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

Tags

Next Story