Kavitha : జాగృతి మహాధర్నా.. కవిత డిమాండ్ ఇదే

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటూ కేసీఆర్ కు జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బుధవారం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి మహాధర్నా పెద్ద ఎత్తున నిర్వహించి ప్రశ్నించాలని నిర్ణయించారు. జాగృతి ఆధ్వర్యంలో 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మహాధర్నా నిర్వహించనున్నారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి నెర్రెలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీ సులు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ జాగృతి తలపెట్టిన మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివాలని పిలుపునిచ్చారు. ప్రాణహిత - చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందు కు రీడిజైన్ చేయాల్సి వచ్చింది. కాళేశ్వరం నిర్మించాక రాష్ట్రానికి కలిగిన ప్రయో జనాలు. ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టడంతో ఏటా యాసంగి సీజన్లో రైతాంగానికి జరుగుతోన్న నష్టాల గురించి, కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తోన్న క్షుద్ర రాజకీయాలపై ధర్నాలో వక్తలు మాట్లాడతారని ఆమె ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com