TG : కొండగట్టులో 70మంది చనిపోతే కేసీఆర్ పోయిండా..? హరీశ్ పై జూపల్లి ఆగ్రహం

TG : కొండగట్టులో 70మంది చనిపోతే కేసీఆర్ పోయిండా..? హరీశ్ పై జూపల్లి ఆగ్రహం
X

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై విమర్శలు గుప్పించిన హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ దురుద్దేశంతోనే SLBCపై హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారనీ.. పది ఏండ్లు పాలించిన బీఆర్ఎస్ ఎందుకు SLBCని పెండింగ్ పెట్టిందని అన్నారు. "హరీష్ రావుకు సూటి ప్రశ్న వేస్తున్నా. ఎందుకు 200 లోమీటర్లు SLBC టన్నెల్ తవ్వి మిగతాది వదిలేసిండ్రు? తక్కవ లాభం వస్తుందనా? SLBC పూర్తి అయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందనా? నా మూడు ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలి. ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటున్నారు. ఎకరాకు లక్ష రూపాయలు అతి తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే SLBC ని ఎందుకు పెండింగ్ పెట్టారు. SLBC గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు. బీఆర్ఎస్ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్ లో చిక్కుకున్న 8మంది బ్రతికే చాన్స్ లేదు. సహాయక చర్యలకు ఇంకా రెండు రోజులు పట్టే అవకాశం లేదు. ప్రమాదం కలిగినప్పుడు కంపెనీ వాళ్లు అలెర్ట్ చేయకపోతే 40 మంది వరకు చనిపోయేవారు. పాలమూరు రంగారెడ్డిలో ఆరుగురు చనిపోయారు. అప్పుడు కేసీఆర్, మంత్రి హరీష్ రావు వచ్చారా? కొండగట్టు బస్ ప్రమాదంలో 70మంది చనిపోతే కేసీఆర్, హరీష్ రావు పోయారా? SLBC సందర్శనకు పర్మిషన్ ఇచ్చాము కదా. అక్కడికి పోయి రాజకీయాలు ఎందుకు? స్కానర్ ద్వారా తెలుసుకోవడం కోసం జాతీయ ఏజెన్సీలను పిలిచాం. స్వయంగా నేను వెళ్ళాను. 50మీటర్లు మాత్రమే కనిపించట్లేదు. యుద్ద భూమిలో హెలికాఫ్టర్ నడిపిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని విమర్శిస్తున్నారు. ఎన్నిసార్లు ఎలికాఫ్టర్ లో తిరిగినా ఏడాదికి ఒకసారి రెంట్ కడతారు. అమరవీరుల, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదనే తాను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చాను. ఇప్పటికైనా హరీష్ రావు శవరాజకీయలు మానుకోవాలి." అని జూపల్లి అన్నారు.

Tags

Next Story