MLA Koonamneni : కాళేశ్వరం వృథా అనలేదు : ఎమ్మెల్యే కూనంనేని

MLA Koonamneni : కాళేశ్వరం వృథా అనలేదు : ఎమ్మెల్యే కూనంనేని
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం వృథా అని తాము చెప్పలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్ట్ ల వల్ల రూ.10 వేల కోట్ల విద్యుత్ భారం పడుతుందని.. ఇంత ఖర్చు పెడితే ఆ నీళ్లు ఎల్లంపల్లికి రావాలన్నారు. ఆ మూడు కాకుండా మిగతా మల్లన్న సాగర్ లాంటివి అన్ని మంచి బ్యారేజ్ లే అని తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మహారాష్ట్ర ఒప్పుకోనందున అక్కడ ప్రాజెక్ట్ కట్టలేదని బీ ఆర్ఎస్ వాళ్లు చెప్పారు. కూలీపోయిన వాటికి రిపేర్లు చేయాలంటే 20 వేల కోట్లు కావాలి. భవిష్యత్ తరాలకు కాళేశ్వరం ఉపయోగ పడాలంటే.. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ తీసివేసి తుమ్మిడి హెట్టి దగ్గర ఒక కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి. బనకచర్లపై తెలంగాణ ప్ర భుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేయాలి. వృథా జలాలను ఎవరి వాటా వారు వాడుకోవాలి. సీతారామ, ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి పథకంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. నేను కేసీఆర్ లాగా అపర మేధావిని కాదు. కాళేశ్వరం ప్రా జెక్ట్ కు లక్ష కోట్ల ఖర్చు అయ్యింది. అందులో ఎంత అవినీతి జరిగిందో కమిషన్ చెబుతుంది. తొందరగా లెక్కలు తేల్చి.. దోషులను కఠినంగా శిక్షించాలి' అని డిమాండ్ చేశారు.

Tags

Next Story