TG : కేసీఆర్ శాసన సభ్యత్వం రద్దు చేయాలి.. గజ్వేల్ నేతల డిమాండ్

X
By - Manikanta |24 March 2025 2:45 PM IST
గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సీఎం నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ చేరుకున్నారు. వారంతా రాజ్భవన్ వెళ్లి గవర్నర్కు వినతిపత్రం అందించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com