KCR : కేసీఆర్ విచారణ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వార్నింగ్

KCR : కేసీఆర్ విచారణ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వార్నింగ్
X

జస్టిస్ ఘోష్ కమిషన్ ను ఉసిగొలిపి రాజకీయంగా కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తోందని బారీస కీలక నేతలు, మాజీ మంత్రు లు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై తాజా పరిణామాలు పార్టీ కేడర్ ను కదిలిస్తున్నాయి. తమ నాయకుడికి ఏమాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ఎక్కడిక్కడ ప్రతిఘటిస్తామన్న హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, రూపకల్పన, నిర్మాణం, నాణ్యతా లోపాలు, నిర్మాణ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, వాటి వెనుక దాగి ఉన్న అక్రమాలు వంటి విషయాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఈ రోజు కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవుతున్నారు.

ఈ కమిషన్ కు భారతదేశపు మొట్టమొదటి లోక్ పాల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన పినాకి చంద్ర ఘోష్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిషన్ ఇప్పటికే వంద మందికి పైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లు, రిటైర్ అయిన మాజీ ఇంజనీర్లు, ఆర్థికశాఖ అధికారులను, కాగ్ అధికారులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పరోక్షంగా, ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అధికారులను విచారించింది. ఆ తర్వాత మాజీ ఆర్థికమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను జూన్ 6, 2025న కమిషన్ విచారణ జరిపింది. జూన్ 9, 2025న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావును విచారించింది.

Tags

Next Story