Kavitha : రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు : కవిత

ఢిల్లీ లిక్కర్ కేసు సమయంలో తాను రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారని కవిత అన్నారు. తనమీద కోపంతో నీపై కేసులు పెడుతున్నారని చెప్పారన్నారు. ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఓడించారని, అదే జిల్లాలో ప్రొటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని తెలిపారు. 2019 ఎంపీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను ఓడించారని కవిత ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే తనతో అన్నారని తెలిపారు. తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతుందన్న కవిత.. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలకు పార్టీ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. తన లేఖను లీక్ చేసిందో ఎవరో చెప్పాలన్నారు. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవని ప్రశ్నించారు. పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరఫున తాను చేస్తున్నానని వెల్లడించారు. లీకు వీరులను పట్టుకోండి అంటే గ్రీకు వీరులు తనపై దాడి చేస్తున్నారని కవిత వాపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com