KCR: దేశంలో మత విద్వేషాలకు బీజేపీనే కారణం: కేసీఆర్

KCR: దేశంలో మత విద్వేషాలకు బీజేపీనే కారణం: కేసీఆర్
KCR: దేశంలో మత విద్వేషాలు తీవ్ర స్థాయిలో హెచ్చుమీరుతున్నాయంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్.

KCR: దేశంలో మత విద్వేషాలు తీవ్ర స్థాయిలో హెచ్చుమీరుతున్నాయంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. విమానం దిగగానే కత్తులు పట్టుకుని, తుపాకీలతో ఎదురొస్తే.. పెట్టుబడి పెట్టేందుకు ఎవరొస్తారంటూ పరోక్షంగా కర్నాటక బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగళూరు సిటీలో 30 లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బతుకుతున్నారని, ఆస్థాయికి ఎదిగిన రాష్ట్రంలో హిబాజ్‌లు, హలాల్‌ల పేరుతో విధ్వంసాలు సృష్టించడమేంటని ప్రశ్నించారు. దేవుని ఊరేగింపులలో కత్తులు తిప్పుతూ, తుపాకీలు కాల్చడమేంటని మండిపడ్డారు. దేశంలో మతం పేరుతో కులం పేరుతో విద్వేశాలు రెచ్చగొట్టే సంస్కృతే ఉండకూడదన్నారు సీఎం కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story