TG : అసెంబ్లీకి కేసీఆర్.. ఆ కొద్ది నిమిషాలు.. ప్రతి నిమిషం ఓ సెన్సేషన్

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు.
ఆ మధ్య ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత గురువారం బడ్జెట్ సెషన్ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తొలిసారి హాజరయ్యారు. కేసీఆర్ అసెంబ్లీకి రాక కోసం ప్రజలే కాదు.. భారాస ఎమ్మెల్యేలు, నేతలు, కాంగ్రెస్ లీడర్లు ఆతృతగా ఎదురు చూశారు. కేసీఆర్ రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారు...? కేసీఆర్ వ్యూహం ఏంటి అనే ఆతృత ఆయా నేతల్లో కనపడింది. కేసీఆర్ రాకతో పార్టీలకు అతీతంగా ఆయనను ఆప్యాయంగా పలకరించారు. అసెంబ్లీలో కేసీఆర్ ఉన్నంత సేపు ఆయన హావభావాలు, ఎక్స్ ప్రెషన్స్ పై చాలామంది దృష్టిపెట్టారు.
ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పడంతో కేసీఆర్ సరదాగా సభలో నవ్వుకున్నారు. బడ్జెట్ లోని కొన్నింటిని టిక్ చేసుకుంటూ ప్రతిది గమనించారు. బడ్జెట్ ముగియడంతో ఆయన ఇంటికి వెళ్లిపోతారని అంతా భావించారు. బయటకు రాగానే కారు సిద్ధం చేయగా.. కేసీఆర్ అనూహ్యంగా మీడియా పాయింట్ ఎక్కడ అని అడిగారు. అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అక్కడి నుంచి పద మీడియా పాయింట్ కు అంటూ స్పీడ్ గా అక్కడికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు అంతా కేసీఆర్ మాట్లాడరేమోననే అభిప్రాయంతో ఉన్నారు. కేసీఆర్ మీడియా పాయింట్ కు రావడం, అక్కడి నుంచే బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. ఉద్యమ నేత కేసీఆర్ ను మళ్లీ యాక్టివ్ కనిపించడం పొలిటికల్ గా హీట్ పెంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com