TG : విగ్రహాల ఘర్షణ మంచిది కాదన్న కోదండరాం

X
By - Manikanta |23 Aug 2024 12:15 PM IST
రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల మధ్య ఘర్షణ పెట్టవద్దని ఎమ్మెల్సీ కోదండరామ్ కోరారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ముఖ్య ద్వారం వద్ద పెట్టాలని ప్రభుత్వం ఆలోచన అని, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రుణమాఫీ విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.
కొద్ది మంది రైతులకే మాఫీ జరగలేదన్నారు కోదండరాం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు పంపిణీ జాప్యం వల్ల రుణ మాఫీలో ఇబ్బంది కలిగిందన్నారు. 12 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు 2016 నుంచి పెండింగ్లో ఉన్నా యన్నారు. రుణ మాఫీ కానీ రైతులు అధైర్యపడొద్దని, త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com