కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాను పోటీ చేస్తే.. జానారెడ్డి మూడో స్థానానికే పరిమితమవుతారంటూ రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించాలంటే ఇప్పుడు బీజేపీకే సాధ్యమని చెప్పుకొచ్చారు. అలాగే తనను బీజేపీలోకి రమ్మని ఆ పార్టీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని.. నాగార్జున సాగర్‌ నుంచి పోటీ చేయమంటూ అడుగుతున్నారని రాజగోపాల్‌ రెడ్డి వెల్లడించారు. అయితే దీనిపై ఇంకా తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

పార్టీ మార్పు గురించి తిరుపతిలో చెప్పిన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్న రాజగోపాల్‌ రెడ్డి. తాను బీజేపీ నుంచి బరిలో దిగితే.. పోటీ టీఆర్‌ఎస్‌ - బీజేపీ మధ్యనే ఉంటుందని చెప్పారు. అలాగే తాను పోటీ చేస్తే.. జానారెడ్డి మూడో స్థానానికే పరిమితమవుతారంటూ రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story