TG : ఒకే వేదికపై కొండా సురేఖ, రఘునందన్, హరీశ్ రావు

TG : ఒకే వేదికపై కొండా సురేఖ, రఘునందన్, హరీశ్ రావు
X

సిద్దిపేట జిల్లాలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనుల నివేదికను ప్రభుత్వంకు అందజేయాలని అధికారులను మంత్రి కొండ సురేఖ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మీటింగ్ లో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుణమాఫీ కానీ రైతులకు ఎప్పటి వరకు చేస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ మంత్రిని అడిగారు. 2 లక్షల రుణమాఫీ కానీ, రైతులకు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి. మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయిన తుక్కాపూర్ గ్రామస్తులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.

Tags

Next Story