KTR : హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ ఇండ్లు ఇవ్వండి.. కేటీఆర్ డిమాండ్

X
By - Manikanta |26 Sept 2024 3:15 PM IST
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా తానుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టామని, హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి నియోజక వర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. జీహెచ్ఎంసీ, బుద్ద భవన్ లు కూడా నాళాల పైనే ఉన్నాయని అన్నారు. మంత్రుల ఇళ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నాయని, ముందు వీటిని కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com