KTR : కేటీఆర్ మెడకు ఈ-కార్ రేసు కేసు

X
By - Manikanta |13 Dec 2024 3:00 PM IST
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఈ-కారు రేసు ఉచ్చు బిగిస్తోంది. కేటీఆర్పై కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. సంబంధిత ఫైల్ ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. ఈ -కార్ రేస్లో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా 46 కోట్ల రూపాయలు చెల్లించినట్లు గుర్తించారు. దీంతో.. దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా కేటీఆర్ పై చర్య తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మంత్రి పొంగులేటి చెప్పిన బాంబు పేలబోతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com