KTR : ఒక రోజు ముందే లండన్, అమెరికాకు కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షెడ్యూల్ కన్నా ఒక రోజు ముందే లండన్, అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. నిన్న ఫార్ములా ఈ రేసు కేసులో ఆయనకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి ఆయన రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. విదేశీ పర్యటనకు కూడా రేపు బయల్దేరాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే అంటే ఇవాళే ఆయన విమానం ఎక్కారు. వచ్చే నెల 3వ తేదీన తిరిగి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న రాత్రి ఏసీబీ నోటీసులు అందుకున్న కేటీఆర్.. తన విదేశీపర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని లిఖితపూర్వకంగా తెలిపినట్టు సమాచారం. అమెరికాలోని డల్లాస్ లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతోపాటు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (యూటీ డల్లాస్ లోని భారతీయ విద్యార్థులను జూన్ 2 న కేటీఆర్ కలుస్తారు. యూకేలో పర్యటించే కేటీఆర్, బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025లో ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com