KTR : రేవంత్ టీమ్ పై కేటీఆర్ కొత్త సెటైర్లు

KTR : రేవంత్ టీమ్ పై కేటీఆర్ కొత్త సెటైర్లు
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో విమర్శించారు. "విషాదంలో మంత్రుల వినోదం. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందులు.. హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు..విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం అంటూ వచన కవిత్వంలో విమర్శలు గుప్పించారు.

"అన్నం వండలేదు గుడిలో తినండి" అని విద్యార్థులకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది ఆదేశాలు ఇచ్చారనీ.. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారనీ.. మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి వంట చేయడం హాస్టల్ సిబ్బంది మానేశారని అన్నారు కేటీఆర్. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక విద్యార్థులు పస్తులు ఉన్నారని.. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా, అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏంటి అని స్థానికులు, విద్యార్థుల తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారని కేటీఆర్ అన్నారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు. జాగో తెలంగాణ జాగో అని పిలుపునిచ్చారు.

Tags

Next Story