KTR : పేదల ఇళ్ల ఖరీదు రూ.25వేలేనా..? కేటీఆర్ ప్రశ్న

X
By - Manikanta |4 Oct 2024 12:45 PM IST
దశాబ్దాల తరబడి నివసిస్తున్న పేద వర్గాల ఇళ్ళను మూసీ ప్రక్షాళన పేరుతో ఉన్నఫలంగా ఖాళీ చేయిస్తూ కూల్చివేతలకు పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం తీరు తీవ్ర అభ్యంతరకరమని కేటీ రామారావు అన్నారు. పేద వర్గాల కలల సౌధం ఖరీదు అక్షరాల 25 వేలేనా ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్ తో పాటు 25 వేల పారితోషకం అంటూ అధికారులు వెకిలి ఆఫర్లు.. కోటి ఆశలతో లక్షలు-కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు 25 వేలా? ఓ సన్నాసి, అదే మీ అన్న ఇంటికి మీ మంత్రుల ఇంటికి 25 వేలు కాదు 50 వేలు ఇస్తే కూల్చమంటారా అడుగు ఒకసారి... అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com