KTR: కేంద్ర బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు..

KTR: కేంద్ర బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు..
KTR: కేంద్ర బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

KTR: కేంద్ర బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. రోజుకో అంశంపై.. రోజుకో విధంగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం ఆర్థికపరమైన అంశాల్లో.. రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ పదే పదే అంటోంది. ఇక మంత్రి కేటీఆర్.. ఈసారి జీడీపీ లక్ష్యంగా మోదీ సర్కారుపై మరోసారి ట్వీట్టర్‌లో విరుచుకుపడ్డారు.

కేంద్రం రాష్ట్రాన్ని టార్గెట్ చేసినా.. రాష్ట్రం కేంద్రానికి సహకరిస్తోందని చెప్పుకొచ్చారు. దేశ జనాభాలో తెలంగాణ 2.5 శాతం ఉన్నా.. దేశ జీడీపీలో మాత్రం 5 శాతం కాంట్రిబ్యూట్ చేస్తుందని స్పష్టంచేశారు. బీజేపీ డబుల్ ఇంజన్ మాటల్లో ఉంటే.. మనం చేతల్లో ఆల్రెడీ డబుల్ ఇంజన్ అని ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం జాతికి గర్వకారణం అన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ ఇప్పటికే డబుల్ ఇంజన్‌లో సక్సెస్ అయిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story